మనీష్కు బంగారు పతకం.
September 04, 2021
0
టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్లో శనివారం భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ బంగారు పతకం సాధించగా, సింఘ్ రాజ్ అధనా రజత పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలో 15 పతకాలు చేరాయి. వీటిలో మూడు పసిడి, ఏడు రజత, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.