గోదావరిలోకి దూకిన మహిళ

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రం లోని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి బ్రిడ్జి పై నుంచి ఓ మహిళ నదిలోకి దూకి గల్లంతయింది. స్థానికులు తెలిపిన వివరాలమేరకు ఎటపాక మండలం గుండాల కాలనీకి చెందిన 24 ఏండ్ల బుయ్యన కీర్తి శుక్రవారం బూర్గంపాడు మండలంలో భద్రాచలం కు సారపాక కు వారధిగా ఉన్న  బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకి గల్లంతయింది. సమాచారాన్ని తెలుసుకున్న బూర్గంపాడు ఎస్ఐ జితేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారుల సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కీర్తి వివాహిత అని ఆమె భర్త పేరు బుయ్యన వీరబాబు అని తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)