చెన్నైలో బారికేడ్లు తోసుకొచ్చిన నిరసనకారులు

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సంఘాలు ఇచ్చిన 'భారత్ బంద్' చెన్నైలో సోమవారం ఉదయం కొద్దిపాటి ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు చెన్నైలోని అన్నాశాలై ప్రాంతంలో పోలీసు బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనంలో అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, వివిదాస్పద సాగు చట్టాలను రద్దు చేయాలంటూ తమిళనాడు రైతులు నిరసనలు సాగిస్తున్నా మోదీ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోందని చెప్పారు. ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని, మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)