తల్లిని హత్య చేసిన పెంపుడు కూతురు

Telugu Lo Computer
0



హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని హిమాయత్ సాగర్‌లో ఓ విదేశియురాలును ఆమె కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్రాన్స్ దేశస్థురాలు మెరిక స్థానికంగా ఉన్న మారిక స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తూ రాజేంద్రనగర్ లో తన దత్తత కూతురు రుమాతో కలిసి నివసిస్తోంది. కొంత కాలం కిందట రూమా ప్రేమలో పడింది. దాంతో తల్లి కూతుళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రుమా తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కలిసి ఆమె మృతదేహాన్ని హిమాయత్ సాగర్ లో పడేశారు. తర్వాత తల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు రుమా ఫిర్యాదు చేసింది. అయితే ఆమె ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. పైగా స్థానికులు కూడా రూమాకు వ్యతిరేకంగా చెప్పారు. దీంతో తమదైన శైలిలో విచారించగా, తల్లిని హత్య చేసినట్టు రుమా అంగీకరించింది ఆమె ఇచ్చిన ఆనవాళ్ల ఆధారంగా హిమాయత్ సాగర్ నుంచి మెరిక మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. రూమాను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే మెరికకు ఇద్దరు సొంత కూతుళ్లు ఉండగా, మరో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని పోషిస్తోంది. ఆస్తి కోసమే దత్తత కూతురైన రోమా.. తల్లిని చంపినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)