వంటిల్లు - చిట్కాలు

Telugu Lo Computer
0


* అగరబత్తి వెలిగించిన తర్వాత రాలే బూడిదతో ఇత్తడి పాత్రలు తోమితే తళతళమంటాయి.

* పచ్చి బఠాణి ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే వాటిని ఓ వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడి నీళ్లలో 3 నిమిషాలపాటు.. మరో మూడు నిమిషాల పాటు చల్లటి నీళ్లలో ముంచాలి. తర్వాత ఎండలో ఆరబెట్టి, వాటిని గాలి వెళ్లని డబ్బాలో వేసి.. ఫ్రీజ్‌లో పెట్టండి.

* ఆమ్లెట్‌ వేసినపుడు గుల్లగా పొంగినట్లు రావాలంటే కొడిగుడ్డు సొనని గిలక్కొట్టే ముందు అందులో చిటికెడ్‌ ఉప్పు వేయాలి. ఆమ్లెట్‌ పొంగుతుంది.

* బిర్యానీ చేసేటపుడు బియ్యం కడిగిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది.

* పప్పు త్వరగా ఉడకాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేయాలి. 

* ఈగలు వంటివి రాకుండా ఉండటానికి రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లు వేసి, టేబుల్‌ స్పూన్‌ ఉప్పు కలిపి కిచెన్‌ ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తే కింద ఏదైనా నూనె, ఇతర పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు తొలగిపోతాయి.

* పండ్లు త్వరగా మగ్గాలంటే.. వాటిని ఓ న్యూస్‌ పేపర్‌లో చుట్టి.. బియ్యం డబ్బాలో పెట్టాలి.

* పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరి.

* తేనెలో నాలుగు మిరియం గింజలు వేస్తే.. చీమలు చేరవు.

* లడ్డూలని ఓ అర నిమిషం మైక్రోవేవ్‌లో ఉంచి తీస్తే తాజాగా ఉంటుంది.

* ఓవెన్‌ను శుభ్రం చేసే ముందు రోజు వంట సొడా చల్లి రాత్రంతా మూత పెట్టాలి. ఉదయమే ఉప్పు, నిమ్మ రసం సమానంగా కలిపి శభ్ర పరిస్తే దుర్వాసన రాదు.

* పసుపునీటితో వంటింటి గట్టును తూడిస్తే.. ఈగలు ముసురుకోవు.

* బంగాళదుంప, బెండకాయ వంటి ఫ్రైలు చేసుకునేటపుడు మూకుడు అడుగు భాగానికి అంటుకుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. మూకుడు వేడి అయిన తర్వాతే నూనె వేయాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)