మమ్మల్ని ఆదుకుంది భారతీయులే !

Telugu Lo Computer
0


తాలిబన్ల ఆగడాలకు బలైపోకుండా అనేక మంది అఫ్ఘానిస్థానీలను భారత్ ఆదుకుంటోందని అప్ఘాన్ మహిళ ఒకరు తాజాగా వ్యాఖ్యానించారు. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచిపెట్టిన ఆమె  విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ''అఫ్ఘానిస్థాన్‌లో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దీంతో..నేను నా కూతుర్ని, మనవరాళ్లను తీసుకుని భారత్‌కు వచ్చేశా. భారత సోదరసోదరీమణులే మమ్మల్ని ఆదుకున్నారు. తాలిబన్లు మా ఇంటిని తగలబెట్టారు. ఈ కష్టసమయంలో నన్ను ఆదుకున్న భారత్‌కు ధన్యవాదాలు'' అని ఆమె వ్యాఖ్యానించారు. భద్రతాకారణాల దృష్ట్యా ఆమె వివరాలను ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది. కాగా.. అఫ్ఘానిస్థాన్‌ నుంచి మొత్తం 168 మందితో బయలు దేరిన ప్రత్యేక విమానం నేటి  ఉదయం రాజధానిలో దిగింది. ఇలా వచ్చిన ప్రయాణికుల్లో 107 మంది భారతీయులు, సిక్కు మతానికి చెందిన 24 మంది అఫ్ఘానిస్థానీలు, ఇద్దరు అఫ్ఘాన్ సెనెటర్లు ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)