డ్వాక్రా సంఘాలకు ఆర్బీఐ శుభవార్త!
August 10, 2021
0
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు తనఖా లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫై చేసింది. మహిళల సహాయంతో బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడం, జీవనోపాధిని కల్పించడానికి భారత ప్రభుత్వం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పథకాన్ని తీసుకొచ్చింది.