తాలిబన్‌ చీఫ్‌ ఎక్కడ..?

Telugu Lo Computer
0

ఆప్ఘనిస్తాన్‌ తాలిబన్ల వశమౌతున్న వేళ వారి ప్రధాన నేత హైబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడున్నాడనే దానిపై ఇప్పుడు పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం ఆరా తీస్తోంది. విదేశీ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు పంచుకున్న సమాచారాన్ని అధ్యయనం చేస్తోంది. రహస్యంగా ఉన్న అఖుంద్‌జాదాను గుర్తించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే ఓ సీనియర్‌ ప్రభుత్వ అధికారి ఇప్పుడు అతడు పాకిస్తాన్‌ ఆర్మీ కస్టడీలో ఉండవచ్చునని చెప్పారు. గత ఆరు నెలలుగా అతడిని తాలిబన్‌ సీనియర్‌ నాయకులు, ఆప్ఘన్ లో హింసాత్మక చర్యలు చేపడుతున్న తాలిబన్లు కూడా చూడలేదు. అతని చివరి బహిరంగ ప్రకటన మేలో రంజాన్‌ సందర్భంగా వచ్చింది. కాగా, పాకిస్తాన్‌ చెరలో ఉండటంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో అన్న విషయంపై భారత్‌ ఆసక్తి కనబరుస్తుంది. మాజీ తాలిబన్‌  నేత అక్తర్‌ మన్సూర్‌ 2016లో అమెరికా డ్రోన్ల దాడిలో మరణించి తర్వాత హైబతుల్లా అఖుంద్‌ జాదా తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యారు. తాలిబన్ల బృందంలో హైబతుల్లా కేవలం సైనికుడే కాకుండా రాజకీయ, మిలటరీ, న్యాయపరమైన అంశాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా అభివర్ణిస్తారు. అయితే పూర్తిగా ఆప్ఘన్ తాలిబన్ల చేతికి వచ్చాకే ఆయన అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)