భారత దేశంలో త్వరలో హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళు పరుగులు పెట్టనున్నాయి. జర్మనీ, పోలాండ్లలో ప్రస్తుతం హైడ్రోజన్ ఇంధనంతో రైళ్ళ ట్రయల్ రన్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మనదేశంలో సైతం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అధారిత టెక్నాలజీ కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ బిడ్లను అహ్వానించింది.
డీజిల్ రైళ్ళకు హైడ్రోజన్ ను ఉపయోగించి నడిపేందుకు అవకాశం ఉంటుందో లేదో తొలుత పరీక్షించనున్నారు. ఈ పరిజ్ణానాన్ని ఉత్తర రైల్వేలోని సోనిపట్-జింద్ సెక్షన్ లోని డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
త్వరలో హైడ్రోజన్ తో రైళ్లు
August 08, 2021
0