బంగారం, వెండి కొనుగోలుదార్లకు తీపి కుబురు. పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. శనివారం పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 820 మేర తగ్గి రూ.47,840 వద్దకు చేరింది. నిన్న ఈ ధర రూ.48,660గా ఉంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.750 తగ్గుదలతో రూ. 44,600 నుంచి రూ.43,850కు దిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందన్న గణాంకాలు వెలువడుతుండటంతో అక్కడి కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ త్వరితంగా వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు పసిడి పతనానికి దారితీసింది.
Post a Comment
0Comments
3/related/default