భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పోలాండ్కు కొత్త రాయబారిని నియమించింది. పోలాండ్ నూతన రాయబారిగా నగ్మా మహ్మద్ మాలిక్ను నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 1991 కేడర్కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన నగ్మా ప్రస్తుతం విదేశాంగ శాఖలో అడిషనల్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ పోలాండ్కు రాయబారిగా నియమించడం పట్ల నగ్మా ఆనందం వ్యక్తం చేశారు. తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని చెప్పారు.
Post a Comment
0Comments
3/related/default