ఇలా వుండగా ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి అనే మహిళ కోవిడ్ తో మరణించింది. ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల పుస్తెలతాడు, చెవి దిద్దులు, యూసఫ్ గూడ కు చెందిన సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు దిద్దులు, జవహర్ నగర్ కు చెందిన భిక్షపతి తల్లిమెడలోంచి గుండ్లమాల దొంగిలించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు కాజేశారు కొన్నాళ్లకు ఆమెను టిమ్స్ నుంచి వేరొక ఆస్పత్రికి మార్చాల్సి వచ్చింది. ఆసమయంలో వారి కుటుంబ సభ్యులు ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు ఆభరణాలు మాయమవ్వడంపై గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. టిమ్స్ లో ఉన్న తమ పేషెంట్ల నగలు పోయాయని మొత్తం ఏడు కేసులు గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ లో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాజు దంపతులు ఒక మృతదేహం నుంచి బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్ కూడా దొచుకున్నారు. ఇటీవల ఆ సెల్ ఫోన్ ను ఆన్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెల్ ఫోన్ ఆచూకి కనుగొన్నారు. దీంతో పోలీసులు రాజు, లతశ్రీలను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తాము చేసిననేరాలు అంగీకరించారు. వీరి వద్దనుంచి 10 తులాల బంగారం, రూ. 10లక్షల విలువైన ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు సంస్ధల్లో తాకట్టుపెట్టిన నాలుగు బంగారు గాజుల్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.