న్యాయవాదిపై దాడి

Telugu Lo Computer
0


మహారాష్ట్ర లోని ముంబై, బోరివాలి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలు అందరూ చూస్తుండగా సత్యదేవ్ జోషి అనే న్యాయవాదిపై కొందారు  మారణాయుధాలతో దాడి చేశారు. ఇనుపరాడ్లు, కర్రలతో  దుండగులు జోషిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడిని ఆపేందుకు స్ధానికంగా గూమికూడిన ప్రజలు కొందరు ప్రయత్నించినప్పటికీ దుండగులు వారిపై కూడా దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన న్యాయవాది జూహూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు. దాడికి సంబంధించి దాహిసర్ లోని ఎంహెచ్‌బీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దాడిలో 15 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు విచారణలో ఉన్న కేసులో న్యాయవాది వాదించటమే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)