యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్ కుమార్ కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషతో ఇటీవలే వివాహం జరిగింది. ఆషాడ మాసం రావటంతో అల్లుడింటికి మామగారి ఇంటినుండి సారె కానుకలు పంపటం ఆనవాయితీ. దీనినే ఆషాడం కావిళ్ళు అనిపిలుస్తారు. ఆ ఆనవాయితీ కొనసాగింపుగా రాజమహేంద్ర వరంలోని మామ బలరామకృష్ణ ఇంటి నుండి యానంకు ఆషాడం కావిళ్ళు పంపారు. వచ్చిన సారెను చూసి అల్లుడు అవాక్కయ్యాడు. ఒక టన్నుచేపలు, రొయ్యలు, పండుగప్పలు, బిందెల్లో 50 రకాల స్వీట్లు, 50 పందెం కోడి పుంజులు, 10 మేకపోతులు, 250 కిలోల కిరాణా సామాగ్రి, 250 రకాల అవకాయ జాడీలు, ఇలా అనేక రకాల వస్తువులను ఆషాడం సారెగా అల్లుడు ఇంటికి పంపారు మామ బలరామకృష్ణ. ఊరేగింపుగా వచ్చిన ఈ ఆషాడం కావిళ్ళ సారెను చూసి స్ధానికులు ఆశ్చర్యపోయారు.
Post a Comment
0Comments
3/related/default