ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారు?

Telugu Lo Computer
0


తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ‘మా’ ఎన్నికలు, శాశ్వత భవనంతోపాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ‘‘గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు’’ అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య, తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను  ‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించగా, నేనూ అందులో భాగస్వామినవుతానాని అన్నారు.  అందరం కలిస్తే ‘మా’ కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు. దీంతోపాటు ఇది గ్లామర్‌ పరిశ్రమ మన సమస్యల్ని బహిరంగంగా చర్చించకూడదు అని బాలయ్య హితవుపలికారు.

Post a Comment

0Comments

Post a Comment (0)