తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. గత కొన్నేళ్లుగా మాచారం పరిధిలోని అటవీ భూములను చెంచులు సాగు చేసుకుంటున్నారు. అయితే వీటిలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. చెంచులు సాగు చేసుకుంటున్న పోడుభూముల్లో మొక్కలు నాటే ప్రయత్నం చేశారు అటవీ శాఖాధికారులు. దీంతో రైతులు అటవీ శాఖాధికారులతో చెంచులు వాగ్వాదానికి దిగారు. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి వెనుదిరిగిన అధికారులు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Post a Comment
0Comments
3/related/default