ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర రిజర్వాయర్కు వరద ప్రవాహం పెరిగింది. సుమారు లక్షా ఎనభై వేల క్యూసెక్యుల నీరు డ్యాంలోకి వచ్చి చేరుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఇప్పటికే దిగువ ప్రాంతాలకు ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.