ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో ఎక్కడపడితే అక్కడ నీరు భారీగా నిలిచిపోయింది. నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకటంతో వర్షాలు భారీగా కురిసాియి. నైరుతి రుతుపవనాలు ఢిల్లీకి ఆలస్యంగా చేరడం 15 ఏళ్లలో ఇదే మొదటిసారి అని వాతావరణ అధికారులు తెలిపారు. దీనితో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అండర్ పాస్ల్లో భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టూవీలర్స్ నీటిలో వెళ్లలేక బైకులను తోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. భారీగా కురిరసిన వర్షాలకు ఢిల్లీ ఎయిమ్స్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. ఇది ఇలావుండగా నిన్నటి వరకు ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులు దంచికొట్టిన వర్షంతో సంతోషం వ్యక్తం చెందుతున్నారు.