ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్లోని మేదాంతా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో ములాయం బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు అన్ని పరీక్షలు చేస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. గతేడాది అక్టోబరులో కరోనా బారిన పడి కోలుకున్న ములాయం.. ఇటీవలే టీకా కూడా వేయించుకున్నారు.
Post a Comment
0Comments
3/related/default