వైద్యురాలికి టోకరా!

Telugu Lo Computer
0


మెస్సీడా హో(34) నైజీరియాలో సరైన ఉపాధి అవకాశాలు లేక మూడేండ్ల క్రితం వ్యాపార పాస్పోర్టుతో ఢిల్లీకి వచ్చాడు. అయితే ఉపాధి అవకాశాలు త్వరగా లభించకపోవటంతో అక్కడే ఉంటున్న నైజీరియన్లతో స్నేహం చేశాడు. వారు పలు మోసాలు చేస్తుండగా గమనించి వారికి సహకరించాడు. అనంతరం అంతర్జాల మోసాలు చేసేందుకు ఎవ్వరికీ అనుమానం రాకుండా మోహన్ గార్డెన్స్లో ఓ చిన్న బేకరి, కూల్డ్రింక్స్ దుకాణాన్ని రెండేండ్ల క్రితం ప్రారంభించాడు. స్నేహితులతో కలిసి ఏడాది పాటు నేరాలు చేసి అనంతరం వారితో విడిపోయాడు. ఏడాది క్రితం నుంచి సొంతంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మందులు, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, పరికరాలకు గిరాకీ ఉంటుందని.. వైద్యులు, ఫార్మా కంపెనీల వారికి ఫోన్లు చేసి వారి నుంచి రూ. వేలు, రూ.లక్షలు నగదు బదిలీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని మెహదీపట్నంలో ఉంటున్న వైద్యురాలికి 20 రోజు క్రితం మెస్సీ ఫోన్ చేశాడు. తాను లండన్లో ఉంటున్న వైద్యనిపుణుడినని పరిచయం చేసుకున్నాడు. ఆమె తయారు చేస్తున్న మూలికల ఫార్ములాను  తనకు విక్రయిస్తే రూ. 5 కోట్లు ఇస్తానంటూ నమ్మించాడు. పౌండ్లలో దిల్లీ ఎయిర్‌పోర్టుకు పార్సిల్ పంపించానని కానీ ఆర్బీఐ, కస్టమ్స్ అని పేర్లు చెప్పి రూ. 42 లక్షలు కొట్టేశాడు. తాను ఢీల్లీకి తీసుకువచ్చిన పౌండ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఈలోపు తన కూతురు చనిపోయిందంటూ వార్త వచ్చిందని వైద్యురాలికి చెప్పాడు. లండన్ వెళ్లేందుకు తనకు రూ.20 వేలు కావాలంటూ అడిగాడు. వైద్యురాలు నిజమేనని నమ్మి డబ్బులు పంపింది. ఆ తర్వాత మెస్సీ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు 15 రోజుల పాటు సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ ఖాతాలు, చిరునామాలు పరిశోధించి అతను ఢిల్లీలో ఉంటున్న మెస్సీ డాన్ హోగా గుర్తించారు. ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లి మోహన్ గార్డెన్ ఠాణా పరిధిలో నివసిస్తున్న డావ్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 31 ఏటీఎం కార్డులు, 12 బ్యాంక్ పాసుపుస్తకాలు, 13 చెక్కుబుక్కులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి అనంతరం హైదరాబాద్ కు  తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)