అధికారిపై పెట్రోల్ తో దాడి

Telugu Lo Computer
0


నిర్మల్ జిల్లా కుబీర్ లో  ఉపాధి హామీ అధికారి రాజుపై పాత సాల్వి గ్రామ సర్పంచ్ సాయినాధ్ పెట్రోల్ తో దాడి చేశాడు. దాడిలో  రాజు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈజీఎస్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం సర్పంచ్ సాయినాథ్ వచ్చారు. గ్రామంలో గ్రావెల్ వర్క్ విషయమై మాస్టర్ రిజిష్టర్‌లో సంతకం పెట్టాలని టెక్నికల్ అసిస్టెంట్ రాజుపై సర్పంచ్ సాయినాథ్ ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు రాజు నిరాకరించాడు. దీంతో ముందే పక్కా ఫ్లాన్ ప్రకారం తీసుకువచ్చిన పెట్రోల్ ను అతని పై పోసి నిప్పటించాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది, స్థానికుల సాయంతో రాజును భైంసాలోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)