కౌశిక్రెడ్డి మరో ఆడియో వైరల్
July 13, 2021
0
సోషల్ మీడియాలో కౌశిక్రెడ్డి మరో ఆడియో వైరల్ అవుతోంది. నియోజకవర్గ కార్యకర్తలకు వరుసగా ఆయన ఫోన్లు చేస్తున్నారు. తానేమీ తప్పు చేయలేదు అంటూ అనుచరులతో కౌశిక్రెడ్డి మంతనాలు చేస్తున్న ఆడియో వైరల్ మారింది. అన్నా, కష్ట కాలంలో తనకు తోడుగా ఉండాలని కౌశిక్రెడ్డి ఫోన్లో అభ్యర్థించారు. వ్యక్తిగతంగా కలుస్తానంటూ తిరుపతి అనే కార్యకర్తకు ఫోన్ చేశారు. తాను ఓడిపోతా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారని, తాను ఎన్నికల్లో బాగా కొట్లాడుదామనుకున్నానని ఫోన్లో తెలిపారు. హుజురాబాద్లో టీఆర్ఎస్, బీజేపీ ఇంఛార్జులు తిరుగుతుంటే కాంగ్రెస్కు మాత్రం ఇంతవరకు ఇంఛార్జీలను నియమించలేదని కౌశిక్రెడ్డి విమర్శించారు. గతంలో టీఆర్ఎస్ హుజూరాబాద్ టికెట్ తనకే అంటూ కౌశిక్రెడ్డి ఫోన్ సంభాషణ కలకలం రేపిన విషయం తెలిసిందే. హుజూరాబాద్ టికెట్కు సంబంధించి మాదన్నపేటకు చెందిన యువకునితో కౌశిక్రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ''టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫామ్ అయింది. యూత్ అందరినీ పార్టీలోకి గుంజాలి. యూత్కు ఎన్ని డబ్బులు కావాలో నేను చూసుకుంటాను. యూత్ సభ్యులకు 2000, 3000 ఇద్దాం'' అంటూ కౌశిక్రెడ్డి ఫోన్లో సంభాషించారు.