డ్రై బనానా

Telugu Lo Computer
0


కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.

డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు... ఎండు ద్రాక్ష.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన_అంజీరా.. కాజూ,బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.

బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన గంగాధర్​ ఓ సాధారణ రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు.

విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేల్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు.

ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే... ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు 

Post a Comment

0Comments

Post a Comment (0)