ఎంపీ కవితకు జైలు శిక్ష!
July 24, 2021
0
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత 2019 ఎన్నికల ప్రచారంలో ఆమె డబ్బులు పంపిణీ చేశారని బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమెకు కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించింది. అప్పటి నుంచి ఈ కేసును విచారించిన న్యాయస్థానం శనివారం తీర్పు వెలువరించింది. జరిమానా రూ.10వేలు కట్టిన ఎంపీకి తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేసింది.