టిక్ టాక్ మోజు భర్త ప్రాణం తీసింది !

Telugu Lo Computer
0


పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్ కు ఆరేళ్ల క్రితం వివాహమైంది.  కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ప్రియాంక బాగా అలవాటు పడింది. ఇది రాను రాను మరీ ఎక్కువైంది. రాత్రికి రాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ప్రియాంక మొత్తంగా సోషల్ మీడియాకే పరిమితమైపో సాగింది. ఇది గమనించిన భర్త పవన్, ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రియాంక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్  ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.పవన్ తల్లి  తన కుమారుడు  మృతికి కోడలే  కారణమని బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)