పోలీసుల హడావిడికి భయపడి పారిపోయిన వధూవరులు!

Telugu Lo Computer
0


ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాపులియా చౌక్ లో  ఒక పెళ్ళిలో పోలీసుల హడావిడికి భయపడి వధూవరులు పెండ్లి మండపం నుండి పోయారు. ఈ మధ్య పెళ్లిళ్లకు.. పేరంటాలకు కూడా కరోనా కండిషన్స్ పాటించాల్సి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇదే అదనుగా ఒక్కోసారి పోలీసులు అతి చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి ఓ పోలీసు పెళ్లి మండలానికి చేరుకొని హడావుడి చేశారు. కోవిడ్ నిబంధనలు సరిగా పాటించడం లేదని.. అతిధులు ఎక్కువమంది వచ్చారని మండపంలో కేకలు వేశారు. దీంతో పెళ్లి సమాయానికి పోలీసులు తమని మరింతగా ఇబ్బంది పెడతారని.. అనవసరమైన కేసులు పెట్టి పెళ్లి చెడగొడతారని భయపడిన ఆ పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు జంటగా కలిసి పెళ్లి మండపం నుండే పారిపోయారు.అయితే ఈ జంట పారిపోయి రెండు రోజులు గడుస్తున్నా ఎక్కడ ఉందని ఇప్పటికీ ఆచూకీ తెలియకపోవడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)