మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్‌ కారు

Telugu Lo Computer
0


జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్‌ ఎలక్ట్రిక్ కారు  ముందుగా భారత్ లో  లాంచ్ చేయనుంది. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా 2025 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి చర్యలు చేపట్టింది. తొలి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని భారత్‌లో లాంచ్‌ చేయాలని కంపెనీ ఒక నివేదికలో తెలిపింది. మారుతి భాగస్వామ్యంతో భారత్‌లో సుజుకి చలామణీ అవుతున్న విషయం తెలిసిందే. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కాంపాక్ట్ కార్ల విభాగంలో జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు వృద్ధికి మరింత సహాయపడనుంది. భారత ఆటోమొబైల్స్‌ రంగంలో మారుతి సుజుకీ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా నిలిచింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)