బీహార్ రాష్ట్రం ముజఫర్పుర్ జిల్లాలో దారుణం జరిగింది. తన చెల్లిని ప్రేమించాడని, యువతి సోదరులు, ఆ యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతడి మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టి చంపేశారు. రామ్పురుశాహ్ ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్(22).. సోనావర్ష గ్రామానికి చెందిన ఓ యవతి ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను యవతి సోదరులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయినా వారు వినలేదు. ఇది తట్టుకోలేకపోయిన యువతి సోదరులు దారుణానికి ఒడిగట్టారు. తన ప్రేయసి పిలుస్తున్నట్లుగా నమ్మించి సౌరభ్ను తమ ఇంటికి పిలిపించారు. అనంతరం.. అతడిని గదిలో బంధించి దాడి చేశారు. సౌరభ్ మర్మాంగం కోసి చిత్రహింసలు పెట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో సౌరభ్ చనిపోతాడని భావించిన నిందితులు.. సౌరభ్ను ఓ ఆస్పత్రిలో చేర్చి పారిపోయారు. ఆసుపత్రిలో సౌరభ్ మృతి చెందాడు. ఈ ఘటనతో సౌరభ్ బంధువులు, గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం.. సౌరభ్ మృతదేహంతో నిందితుల ఇంటి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల ఇంటి ముందే మృతదేహాన్ని దహనం చేశారు.
Post a Comment
0Comments
3/related/default