కిట్టీ కుమారమంగళమ్ హత్య

Telugu Lo Computer
0


మాజీ కేంద్రమంత్రి రంగరాజన్ కుమారమంగళమ్ భార్య కిట్టీ కుమారమంగళమ్ హత్యకు గురయ్యారు.  కిట్టీ కుమార మంగళం వసంత్ విహార్‌లోని ఆమె నివాసంలోనే హత్యకు గురయ్యారు. ఈ కేసు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం రాజు అనే  నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 67 సంవత్సరాల వయస్సున్న కిట్టీ కుమరమంగళం హత్య వెనుక దోపిడీ ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య కేసులో కిట్టీ ఇంట్లో బట్టలు ఉతికేవాడుగా పనిచేస్తున్న  24 ఏళ్ల రాజు అనే యువకుడిని అరెస్ట్ చేశామని ఢిల్లీ సౌత్ వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఇంగిత్ ప్రతాప్ సింగ్ వెల్లడించారు. అతనే ఈ హత్య చేశాడని తెలిపారు.దీనిపై కమిషనర్ మాట్లడుతూ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఎప్పటిలాగే ఆమె ఇంట్లో పనిచేసేందుకు  రాజు  వెళ్లాడు. ఆ సమయంలో కిట్టి మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాజు లోపలికి వెళ్లిన తర్వాత డోర్ పెట్టేసి, కిట్టీపై దాడి చేశాడు. ఆమెను గదిలో బంధించి కాళ్లు చేతులు కట్టేసి..మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో దిండుతో ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేశారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రాజుకు సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పీఆర్ కుమారమంగళం 1984లో తమిళనాడులోని సేలం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 1998 నుంచి 2000 వరకు తిరుచిరాపల్లి ఎంపీగా ఉన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కేబినెట్‌లో న్యాయశాఖమంత్రిగా, ఆ తరువాత మాజీ ప్రధాని వాజ్‌పేయ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన 2000 కన్నుమూశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)