మమతకు 5వేల జరిమానా!

Telugu Lo Computer
0


నారద కుంభకోణం కేసులో సరైన సమయంలో అఫిడవిట్‌ దాఖలు చేయడంలో విఫలమైనందుకు మమతా బెనర్జీకి రూ.5,000  కోల్‌కత్తా హైకోర్టు జరిమానా విధించింది నారద స్కామ్ కేసులో గత నెలలో ఇద్దరు మంత్రులు సహా నలుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ లను నిరసిస్తూ సీబీఐ కార్యాలయం ఎదుట సీఎం మమతా బెనర్జీ నిరసన చేపట్టారు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మలయ్‌ ఘటక్‌ కేసు విచారణ జరుగుతున్న కోర్టు ప్రాంగణానికి వెళ్లి ఆందోళన చేపట్టారు. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ  ఈ కేసును కింది కోర్టు నుంచి హైకోర్టు స్వీకరించాలంటూ పిటిషన్ వేసింది. దీంతో హైకోర్టు కేసు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో నాయకుల అరెస్టు జరిగిన రోజు తాము వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి, న్యాయమంత్రి,రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 9న హైకోర్టుకు సమాధాన అఫిడవిట్ సమర్పించగా.. న్యాయస్థానం వాటిని తిరస్కరించింది. కోర్టు చెప్పిన సమయం కాకుండా తమకు నచ్చినప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వాటిని స్వీకరించబోమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై మమతా బెనర్జీ, న్యాయమంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనపై గతవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. మమతా బెనర్జీ, తదితరులు ఇచ్చిన సమాధానాన్ని కోల్‌కత్తా హైకోర్టు స్వీకరించకపోవడం చట్టబద్ధం కాదని వ్యాఖ్యానించింది. వారి అఫిడవిట్లను రికార్డు చేయడంతో పాటు కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలంటూ బెంగాల్ సీఎం దీదీ గత సోమవారం కోల్‌కత్తా హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును అంగీకరించిన న్యాయస్థానం సరైన సమయంలో అఫిడవిట్లు ఇవ్వనందుకు గానూ దీదీకి మరియు న్యాయశాఖ మంత్రికి రూ. 5వేల జరిమానా విధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)