ఆగస్ట్ 15 నుంచి బడులు
July 07, 2021
0
ఆంధ్రప్రదేశ్ లో ఆగస్ట్ 15 నుండి పాఠశాలలను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈలోపు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలన్నారు. ఇవాళ విద్యారంగంలో నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నూతన విద్యావిధానం ప్రతిపాదనలను ఈవారంలో ఖరారు చేయాలని, నాడు-నేడు పనులు యాథావిధిగా కొనసాగించాలని చెప్పారు.