కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పనితీరును మోదీ పరిగణనలోకి తీసుకొని, ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఈయనకు కేబినెట్ హోదా దక్కడంతో జంట నగరాల్లోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకొని, స్వీట్లు పంచుకున్నారు.
కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి
July 07, 2021
0