నైజీరియాలోని కడునా రాష్ట్రంలోని బెతేల్ బాప్టిస్ట్ హైస్కూల్పై సోమవారం తెల్లవారుజామున దాడి చేసిన దుండగులు అక్కడ ఉన్న 165 మంది విద్యార్థులను అపహరించారు. అయితే అందులో 25 మంది పిల్లలు వారిని తప్పించుకొని క్షేమంగా బయటపడ్డారు. కిడ్నాప్ చేసిన పిల్లలను దుండగుల ముఠా రహస్య ప్రదేశానికి తరలించినట్టుగా అక్కడి అధికారులు తెలిపారు. పోలీసులు బలగాలు ప్రస్తుతం విద్యార్థుల ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికి వెయ్యి మందికిపైగా పిల్లలను పలుమార్లు కిడ్నాప్ చేసిన గ్యాంగ్ లతో అధికారులు చర్చలు జరిపి వారి డిమాండ్లను నెరవేర్చిన అనంతరం వదిలేశారు. ముఖ్యంగా ఈ కిడ్నాప్స్ అన్నీ గ్రామీణ ప్రాంతాలలోని స్కూల్స్, కాలేజీలలో జరుగుతున్నాయి.
Post a Comment
0Comments
3/related/default