పెళ్లయిన ఏడు రోజులకే..!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో గత నెల 29న వివాహం చేశారు. రెండు రోజుల కిందట వధూవరులు గాదరాడ వచ్చారు. ఆషాఢమాసం వస్తుండటం, సోమవారం మంచిరోజు కావడంతో సాయంత్రం తిరిగి వధువును పుట్టింటికి పంపడానికిసిద్ధం చేశారు. అంతలోనే స్వాతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఆమెకు అశోక్‌ మేనమామ వరస అవుతాడు. అశోక్‌ తాపీ పని చేస్తుంటాడు. ఈ మధ్యనే కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాక వివాహం చేసుకున్నాడు. అశ్విని మృతితో అతడు కుప్పకూలాడు.  దగ్గర బంధువులే కావడంతో ఆమె మృతి విషయం బయటకు రాకుండా ఇరు కుటుంబాల వారు రాజీపడ్డారు.  పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. బంధువుల్లో  ఒకరు 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహానికి తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)