నామా ఇంట్లో ఈడీ సోదాలు

Telugu Lo Computer
0


టీఆర్ఎస్‌ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసం, హైదరాబాద్‌లోని నామా కంపెనీ మధుకాన్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే సీఎండీ కే శ్రీనివాస్ రావు, డైరెక్టర్లు ఎన్. సీతయ్య, ఎన్. పృథ్వీ తేజ నివాసంలోనూ తనిఖీలు చేశారు. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకొని విదేశీ కంపెనీలకు  డబ్బులను మళ్లించినట్లు నామా నాగేశ్వరరావుపై అభియోగాలు వచ్చాయి.  రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈక్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ లోన్‌కు నామా నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్‌గా ఉన్నారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ వే డైెరెక్టర్‌గా ఉన్న పృథ్వీ తేజ నామా నాగేశ్వరరావు తనయుడు. వీరి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేస్తున్నారు. కంపెనీ అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను విశ్లేషిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)