హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో 83 ఏళ్ల రాణి అనే ఏనుగు మరణించింది. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాణి వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యల కారణంగానే మరణించినట్టు జూ అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జూలో ఉన్న అన్ని జంతువులతో పోల్చితే రాణి వయుసు రీత్యా పెద్దది. 1938 అక్టోబర్ 7 న జన్మించింది . 1963 లో దానిని నాంపల్లి లోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి నెహ్రూ జూ కి తీసుకువచ్చారు. హైదరాబాద్ లో జరిగే బోనాలు సంబరాలు, అలాగే మొహర్రం సందర్భంగానూ జరిగే ఊరేగింపులో రాణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది.