ఇంజక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న ముఠా అరెస్ట్

Telugu Lo Computer
0


బ్లాక్ ​ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఇంజక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5 ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లు, 4 సెల్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఇద్దరు వైద్యులుండటం గమనార్హం. ప్రధాన నిందితుడైన మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మలక్​పేట్ యశోద ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న రవితేజ, మరో ఇద్దరు వైద్యులతో కలిసి ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్​లో విక్రయించేందుకు పథకం పన్నాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న మరో ముగ్గురు సిబ్బందితో చేతులు కలిపాడు. 350 రూపాయలకు ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను కొనుగోలు చేసిన వైద్యుడు రవిజేత... ఒక్కో ఇంజక్షన్​ను రూ. 50 వేలకు విక్రయించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 84 వద్ద ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా టాస్క్​పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వైద్యులతో పాటు,  మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)