హైదరాబాద్ పోలీసులు చేస్తున్న కరోనా పోరుకు అండగా, మైక్రోసాఫ్ట్ తన వంతు సహాయంగా 135 అల్ట్రావయలెట్ (యువి) బాక్సులను విరాళంగా అందజేసింది. కీలక డాక్యుమెంట్లను శానిటైజ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. దీని వల్ల బ్యాక్టీరియా క్రిములు, వైరస్ వ్యాప్తి కాకుండా అరికట్టవచ్చు. మైక్రోసాఫ్ట్ ఇండియా (ఆర్ అండ్ డీ) ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ 135 యూవీ బాక్సులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజని కుమార్కు అందజేశారు.