భారత్ స్కోర్ 217/10

Telugu Lo Computer
0



ఇంగ్లాండ్ లోని సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయిన టీమిండియా రెండవ సెషన్‌ ప్రారంభానికి చేతులెత్తేసింది. మొత్తం 92 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయిన టీమిండియా 217 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజు వర్షం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. రెండవ రోజు రెండు సెషన్లు బాగానే నడిచినా, మూడవ సెషన్ ప్రారంభం సమయానికి లైటింగ్ సమస్య తలెత్తడంతో మ్యాచ్ నిలిచిపోయింది. రెండవ రోజు టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.  ఇక మూడవ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన ప్లేయర్లు అంతా కాసేపు కూడా నిలవలేకపోయారు. జెమిసన్ దెబ్బకు వారు కూడా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. మొత్తానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. జెమిసన్ 5/31, వాగ్నర్ 2/40,   బౌల్డ్ 2/47 తమ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)