అమూల్ పాల ధర పెంపు

Telugu Lo Computer
0

అమూల్ పాల ధరను  పెంచింది. ఇకపై అన్ని బ్రాండ్ల మీద  రెండు రూపాయలు పెంపు ఉంటుంది. ఈ ధరలు జులై 1నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఐఎమ్ఎమ్ఎఫ్) అధికారికంగా ప్రకటించింది. దాదాపు 19 నెలల తర్వాత పాల ధరలు పెంచినట్లు సంస్థ పేర్కొంది. పాల ఉత్పత్తి కోసం చేస్తున్న ఖర్చు పెరగడం, ట్రాన్స్‌పోర్టేషన్ ఛార్జీలు పెరగడం, ప్యాకేజింగ్, లాజిస్టిక్ లలో కూడా ఎక్కువ ఖర్చులు అవుతున్నట్లు స్పష్టం చేసింది. పాల ధరలే కాకుండా నూనె, టీ, సబ్బుల ధరలు, ప్యాక్ చేసిన ఆహార ధాన్యాల ధరలు కూడా పెరిగిపోయాయి. అందుకే ఫ్రెష్ మిల్క్ క్యాటగిరీలో మార్పులు చేసి ధరలు పెంచుతున్నట్లు  జీసీఐఎమ్ఎమ్ఎఫ్ చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)