కృష్ణా జిల్లా, మైలవరం మండలంలోని గణపవరం గ్రామంలో మహిళపై గోపీ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. పదేళ్ల పాటు సహ జీవనం చేసిన మహిళ తనను దూరం పెట్టడంతో అనుమానంతో ఆమెపై యాసిడ్తో దాడి చేశాడు. శుక్ర వారం
రాత్రి అదే గ్రామానికి చెందిన చల్లా నాగరాజు డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంటికి వచ్చాడు. వారిద్దరు మాట్లాడుకుంటుండగా గోపీ కిటికీలో నిండి యాసిడ్ విసిరినట్లు తెలుస్తుంది. దేనితో మహిళతో పాటు, నాగరాజుకు కూడా గాయాలయ్యాయి. . బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు మైలవరం ఎస్ ఐ రాంబాబు తెలిపారు.