మధ్యప్రదేశ్ విదిశా జిల్లా ఘట్వాయీ గ్రామానికి చెందిన విజయ్ సింగ్ రఘువంశీ అనే రైతుకు ఓ క్రేజీ థాట్ వచ్చింది. ఆటో ఇంజిన్తో ఓ మినీ ట్రాక్టర్ను తయారుచేశాడు. ఇందుకోసం అతడు కేవలం రూ. 25వేలు మాత్రమే ఖర్చు పెట్టాడు. పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్ కొనుగోలు చేసి మెకానిక్తో రిపేర్ చేయించాడు. సొంతంగా ట్రాక్టర్ బాడీ తయారుచేసి, ఇంజిన్ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్ను రెడీ చేశాడు. దీనితో పావు ఎకరాన్ని 3 గంటల్లో దున్నవచ్చని, ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్ అవసరం అవుతుందని, గ్యాస్తో కూడా దీనిని నడపవచ్చని విజయ్ సింగ్ తెలిపాడు. 14 లీటర్ల గ్యాస్తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్ పనిచేస్తుందని తెలిపాడు. తనకున్న 1.5 ఎకరాల భూమిలో సాగు సులభమైందన్నాడు.
Post a Comment
0Comments
3/related/default