రూ. 25 వేలకే ట్రాక్టర్ !

Telugu Lo Computer
0



మధ్యప్రదేశ్​ విదిశా జిల్లా ఘట్​వాయీ గ్రామానికి చెందిన విజయ్​ సింగ్​ రఘువంశీ అనే రైతుకు ఓ క్రేజీ థాట్ వ‌చ్చింది. ఆటో ఇంజిన్​తో ఓ మినీ ట్రాక్టర్​ను త‌యారుచేశాడు. ఇందుకోసం అత‌డు కేవలం రూ. 25వేలు మాత్ర‌మే ఖ‌ర్చు పెట్టాడు. పాడైపోయిన ఆటో నుంచి ఇంజిన్​ కొనుగోలు చేసి మెకానిక్​తో రిపేర్ చేయించాడు. సొంతంగా ట్రాక్టర్ బాడీ​ త‌యారుచేసి, ఇంజిన్​ అమర్చి, బాడీకి మూడు చక్రాలు బిగించి మినీ ట్రాక్టర్​ను రెడీ చేశాడు. దీని​తో  పావు ఎకరాన్ని 3 గంటల్లో దున్నవచ్చని, ఇందుకు కేవలం ఒకటిన్నర లీటర్ల డీజిల్​ అవసరం అవుతుందని,   గ్యాస్​తో కూడా దీనిని నడపవచ్చని  విజయ్​ సింగ్​ తెలిపాడు. 14 లీటర్ల గ్యాస్​తో 58 నుంచి 62 గంటల పాటు ఇంజిన్​ పనిచేస్తుందని తెలిపాడు. తనకున్న  1.5 ఎకరాల భూమిలో సాగు సులభమైందన్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)