* ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదు.
* 6-11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు, డాక్టర్ పర్యవేక్షణలో మాస్క్ ధరించాలి.
* 12-17 ఏళ్ల మధ్య వారు పెద్ద వారి మాదిరిగానే మాస్క్ లు ధరించాలి.
* మాస్క్ లు వాడే సమయంలో సబ్బుతో, శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలి.
అలాగే కరోనా సోకిన 18 సంవత్సరాలులోపు వయస్సు ఉన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్ సీటీ స్కాన్ను తీయించాలని సూచించింది.
స్టెరాయిడ్లను కూడా దాదాపు వాడవద్దన్న ఆరోగ్యశాఖ, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్గా భావించాలన్నారు. లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, వీటివల్ల హానికరమని కేంద్రం పేర్కొంది