ఆంధ్రప్రదేశ్ లో 4,981కేసులు, 38 మరణాలు
June 24, 2021
0
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 88,662 మందికి పరీక్షలు నిర్వహించగా 4,981 కరోనా కేసులు నమోదు కాగా, 38 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 18,67,017కి చేరగా, వైరస్తో 12,490 మంది చనిపోయారు. అలాగే రాష్ట్రంలో 49,683 యాక్టివ్ కేసులు ఉండగా, 18,04,844 మంది కోలుకున్నారు. 24 గంటల్లో 6,464 మంది రికవరీ అయ్యారు. చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, అనంతపురం, కడప, విశాఖ, విజయనగరంలో ఒకరు చొప్పున మృతి చెందారు.
Tags