అమితాబ్ బచ్చన్ 1.75 కోట్ల సాయం!

Telugu Lo Computer
0


ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. సుమారు రూ.1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్‌లో గల లోకమాన్య తిలక్‌ మున్సిపల్‌ జనరల్‌ ఆస్పత్రికి అందజేశారు. ఈ విష‌యాన్ని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ తెలియ‌జేసింది. ఈ వెంటిలేటర్లను సర్జరీ విభాగంలో అమర్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఇవి శ్వాస స‌మ‌స్య‌తో బాధ‌పుడుతున్న వారికి వెంటిలేట‌ర్స్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వైద్యులు తెలిపారు. 

క‌రోనా పోరులో భాగంగా సుమారు రూ.15కోట్లు వరకూ విరాళంగా ఇచ్చాను అని ఈ మ‌ధ్య అమితాబ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దిల్లీలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు రెండు కోట్లు సాయం చేసిన అమితాబ్ జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చారు. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశారు. ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం, సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు సమకూర్చారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)