చందమామ వస్తున్నా ......

Telugu Lo Computer
0

 

అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్  అనే సంస్థ రూపొందించిన స్టార్ షిప్ లో చంద్రుని వద్దకు వెళ్లేందుకు జపాన్ కు చెందిన వ్యాపారవేత్త యూసాకు మేజవా సమాయత్తమౌతున్నాడు. ఈయన ఆన్లైన్లో వస్త్ర వ్యాపారం చేస్తాడు. 2023లో ఈ పర్యటన జరిగే అవకాశం వుంది. తను నిర్వహించే ఒక పోటీలో విజేతలైల్ 8 మందితో కలసి వెళతారు. వారు చంద్రునిపై దిగారు. జాబిల్లిని చుట్టి వస్తారు. 

అంతకు ముందు రోదసీలో గడిపి రావడానికి సిద్ధమవుతున్నారు. భూ భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్ఎస్)కి పయనమౌబోతున్నారు.  తన కంపెనీ ఉద్యోగి యోజో హిరానోతో కలసి  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి రష్యాకి చెందిన సోయాజ్ వ్యోమ నౌకలో రెండు సీట్లు ఖరారు చేసుకున్నాడు. ఈ ఇద్దరితో పాటు రష్యా  వ్యోమగామి అలెగ్జా డర్ వెళతారు. ఈ ప్రయాణం ఈ ఏడాది డిసెంబర్ 8న కజకిస్తాన్ నుండి వుంటుంది

రోదశీలో జీవనం ఎలా ఉంటుందోనన్న కుతూహలం నాలో ఉంది. దానిని గురించి తెలుసుకొని, ప్రపంచంతో పంచుకోవాలని వుందని యూసాకు అంటున్నారు.   


Post a Comment

0Comments

Post a Comment (0)