ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధనా మండలి) నిర్వ్హయించిన సెరో సర్వేలో ఆశ్ఛర్యకరమైన విషయాలు వెల్లడైనాయి. దేశ జనాభాలో 24. % కరోనా బారిన పడినట్లు తేల్చింది. కేంద్ర ప్రకటించిన గణాంకాలకు భారత వైద్య పరిశోధనా మండలి తేల్చిన లెక్కలకు అసలు పొంతన లేదు. దేశంలో కేవలం 2% మందికి మాత్రమే కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల ప్రకటించింది. 2020 డిసెంబర్ నుండి 2021 జనవరి మధ్య ఐసీఎంఆర్ ఈ సర్వే జరిపింది. దీని ప్రకారం ఒకరికి కరోనా కేసు గుర్తిస్తే 27 మందికి సోకినట్లేనని తెలుస్తుంది. ఆరోగ్య సిబ్బందిలో 25. శాతం కరోనా బారిన పడినట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలలోని కేసులు ఎక్కువ ఉన్నట్లు తెలిపింది.