రఘుబాబు కు బెయిల్ మంజూరు !

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండలో జరిగిన యాక్సిడెంట్‌ కేసులో సినీ నటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ నల్గొండ కోర్టు తీర్పునిచ్చింది. బుధవారం మధ్యాహ్నం వెంచర్ వద్దకు వెళ్లి బైక్‌పై వస్తున్న ధినేని జనార్ధన్‌రావును హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న రఘుబాబు బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొంది.ఈ ఘటనలో జనార్థన్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రఘుబాబుని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు నల్గొండ కోర్టులో ఆయనను హాజరుపరిచారు. ఇక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)