ఐపీఎల్‌ సీజన్‌లో బోణీ కొట్టిన ముంబయి !

Telugu Lo Computer
0


పీఎల్‌-17 సీజన్‌లో ముంబయి ఖాతా తెరించింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. స్టబ్స్‌ (71*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) పోరాటం వృథా అయ్యింది. ఓపెనర్‌ పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు. 3 సిక్స్‌లు), అభిషేక్ పొరెల్‌ (41; 31 బంతుల్లో 5 ఫోర్లు) కూడా దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. ముంబయి బౌలర్లలో గెరాల్డ్ కొయెట్జీ 4 వికెట్లు తీయగా, బుమ్రా 2, షెఫర్డ్‌ వికెట్‌ పడగొట్టారు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ క్రీజులోకి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పీయూష్‌ చావ్లా వేసిన 13 ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఆకాశ్‌ వేసిన 17 ఓవర్‌లో వరుసగా 4,6,4 బాదేసి 19 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 19 ఓవర్‌లో మూడు సిక్సర్లు రాబట్టాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (49; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్ (42; 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ డేవిడ్‌ (45*; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. హార్దిక్‌ పాండ్య (39: 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించాడు. రొమారియో షెఫెర్డ్‌ (39*; 10 బంతుల్లో) చివరి ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాది 32 పరుగులు రాబట్టాడు. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, నోకియా 2, ఖలీల్ అహ్మద్‌ ఒక వికెట్ తీశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)