రేపు బీజేపీలో చేరనున్న నటి సుమలత !

Telugu Lo Computer
0


నటి, మాండ్య ఎంపీ సుమలత రేపు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధే ప్రధాన మంత్రంగా, ప్రధాని నరేంద్ర మోడీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. కాగా గత ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గ స్వతంత్య్ర అభ్యర్థి ఎంపీగా సుమలత ఎన్నికయింది .దీంతో ఆమె రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, జేడీఎస్ కూటమికి సపోర్టు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎంపీ సుమలత అంబరీష్ 2019 ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. సుమలత మాండ్య లోక్సభ నియోజకవర్గానికి 4000 కోట్ల నిధుల్ని కేంద్రంలోని బిజెపి సర్కారు నుంచి రిలీజ్ చేసినట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిన్న కాంగ్రెస్ పార్టీ నేత ,బాక్సర్ విజేందర్ సింగ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. సీనియర్ నేతల సమక్షంలో విజయేందర్ సింగ్ కి కాషాయం పార్టీలో చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)